ప్రశ్నలు మరియు సమాధానాలు

దేవుని మీరెలా గుర్తిస్తారు?

మనమందరము సమ్మతించే ప్రశ్నలు మరియు జవాబులు
1. మనుష్యులు ఎవరి పేరిట ప్రార్థన చేయుటకు కూడుకొందురు?
జ) దేవుని
2.మనుష్యులు ప్రార్థన చేయుటకై కూడుకొన్నప్పుడు ఎవరి సన్నిధి వారి మధ్య ఉంటుంది?
జ) దేవునిది
3. దేవ దూతలను ఎవరు పంపిస్తారు?
జ) దేవుడు
4. పరలోకముకై ఏర్పరచబడినవారు ఎవరికి చెందినవారు?
జ) దేవునికి
5. దేవుని వెంబడించేవారితో నిత్యము ఎవరి సన్నిధి ఉంటుంది?
జ) దేవునిది
6.పరలోకములో ఉండేదెవరు?
జ) దేవుడు
7. పరలోకములో నుండి దిగి వచ్చేదెవరు? 
జ) దేవుడు
8. నిత్య జేవము పొందుట కొరకై ఎవరి నామములో మనము విశ్వాసముంచాలి?
జ) దేవుని
9. ఆత్మ రక్షణ ఎవరి ద్వారా కలుగుతుంది?
జ) దేవుని ద్వారా
10. మనకున్న ఆత్మీయ ఆకలిని దప్పికని తీర్చగలవారు ఎవరు?
జ) దేవుడు
11. అంత్యదినమున  మనుష్యులను సజీవులుగా లేపేది ఎవరు?
జ) దేవుడు
12. జీవాహారము ఎవరు?
జ) దేవుడు
13. ఎవరి మాటలు గతించిపోకుండా నిత్యమూ నిలిచి ఉంటాయి?
జ) దేవునివి
14. జీవమునిచ్చే ప్రాణ దాత ఎవరు?
జ) దేవుడు
15. జీవమైయున్నవాడు ఎవరు?
జ) దేవుడు
16. తనకొరకు మన ప్రాణం పోగొట్టుకున్నయెడల మన ప్రాణమును తిరిగి మనకివ్వగల వారెవరు?
జ) దేవుడు
17. అత్యున్నతమైన ప్రేమకు పాత్రుడైనవాడు ఎవరు?
జ) దేవుడు
18. జీవజల నదివలె దేవుని ఆత్మను మనకు ప్రసాదించగలవారెవరు?
జ) దేవుడు
19. లోకమునకు వెలుగు ఎవరు?
జ) దేవుడు
20. మనుష్యులను పాపము నుండి విడిపించగలవారెవరు?
జ) దేవుడు
21. పాపములను క్షమించే అధికారం కలిగిన వారెవరు?
జ) దేవుడు
22. నిత్యుడైన వారెవరు?
జ) దేవుడు
23. పునరుత్థానమును జీవమునైనవారెవరు?
జ) దేవుడు
24. “ఫ్రభువు” అని పిలవబడుటకు అర్హుడెవరు?
జ) దేవుడు
25. విశ్వాసులకు పరలోకములో ఒక స్థలము సిద్ధపరచ గలవారెవరు?
జ) దేవుడు
26. మనలను నిత్య జీవమునకు చేర్చగల “మార్గము” ఎవరు?
జ) దేవుడు
27. మనలను నిత్య జీవమునకు చేర్చగల “సత్యము” ఎవరు?
జ) దేవుడు
28. మంచి ఫలములు ఫలించుటకు అనగా మంచి పనులను చేయుటకు మనకు శక్తిని అనుగ్రహించేవారెవరు?
జ) దేవుడు
29. ఎవరికి దూరంగా ఉంటే నీవు ఏమీ చేయలేని వాడవైపోతావు?
జ) దేవునికి
30. మరణము మరియు పాతాళము యొక్క తాళపు చెవులు కలిగిన వారెవరు?
జ) దేవుడు
31. హృదయములను మనసులను పరిశోధించే వారెవరు?
జ) దేవుడు
32. ప్రతివాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చేది ఎవరు?
జ) దేవుడు
33. మనుష్యులకు తీర్పు తీర్చుటకై పరలోక మేఘములపై రాబోయేదెవరు?
జ) దేవుడు
34. సబ్బాతు దినమునకు ప్రభువు ఎవరు?
జ) దేవుడు
35. నూతన సృష్టి ద్వారా సమస్తమును పునః స్థితిస్థాపన చేయబడ్డప్పుడు తన మహిమగల సింహాసనమందు కూర్చునేదెవరు?
జ) దేవుడు
36. సమస్త జనములకు తీర్పు తీర్చే తీర్పరి ఎవరు?
జ) దేవుడు
పైనున్న లక్షణాలు దాదాపు అన్నీ కూడా కేవలం దేవునికే చెందినవని నీవు కూడా నాతో అంగీకరిస్తావా?
అంగీకరించను. (అలాగైతే, నీవు అంగీకరించకపోవుటకు కారణామేమిటో మరియు దేవుని గుర్తించటకు లేక ఎరుగుటకు ఇంకా కావలసినదేమిటో మాకు తెలుపగలరు)
అంగీకరిస్తాను. (అలాగైతే, ఈ క్రింద ఇవ్వబడిన దాని గురించి నీవింకేమంటావు?)
యేసు క్రీస్తు ప్రభువు మానవ రూపములో వచ్చిన దేవుడని క్రైస్తవులు ఎందుకు ప్రచురిస్తారు? ఈ అభిప్రాయమును లేక నమ్మకమును క్రైస్తవులు సొంతగా కనిపెట్టలేదు కాని యేసు క్రీస్తు ప్రభువే మాటి మాటికీ ఈ విషయములను వ్యక్తపరచి వివరించారు.
యేసు క్రీస్తు ప్రభువు తానే స్వయముగా ఇచ్చిన జవాబులు ఇప్పుడు చూద్దాం.
1. మనుష్యులు ఎవరి పేరిట ప్రార్థన చేయుటకు కూడుకొందురు?
జ) యేసు క్రీస్తు ప్రభువు పేరిట
ప్రభువైన యేసు చెప్పెను - “ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున (ప్రార్థన చేయుటకు) ఎక్కడ కూడియుందురో”. మత్తయి 18:19,20
2.మనుష్యులు ప్రార్థన చేయుటకై కూడుకొన్నప్పుడు ఎవరి సన్నిధి వారి మధ్య ఉంటుంది?
జ) యేసు క్రీస్తు ప్రభుని సన్నిధి
ప్రభువైన యేసు చెప్పెను - “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యమ ఉందును”. మత్తయి 18:19,20
3. దేవ దూతలను ఎవరు పంపిస్తారు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “మనుష్యకుమారుడు తన దూతలను పంపును”. మత్తయి 13:41
ప్రభువైన యేసు చెప్పెను - “అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమిమీద ఉన్న సకల గోత్రములవారు రొమ్ముకొట్టుకొందురు;  మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును”. మత్తయి 24:30,31 [ఇంకా మత్తయి 16:27, 25:31]
4. పరలోకముకై ఏర్పరచపడినవారు ఎవరికి చెందినవారు?
జ) యేసు క్రీస్తు ప్రభువుకు
ప్రభువైన యేసు చెప్పెను - “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును.....మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశముయొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు”. మత్తయి 24:30, 31
5. దేవుని వెంబడించేవారితో నిత్యము ఎవరి సన్నిధి ఉంటుంది?
జ) యేసు క్రీస్తు ప్రభుని సన్నిధి
ప్రభువైన యేసు చెప్పెను - “ఇదిగో నేను యుగసమాప్తి పర్యంతము సదాకాలము మీతోకూడా ఉన్నాను”.  మత్తయి 28:20
6.పరలోకములో ఉండేదెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయినవాడెవడును లేడు”.  యోహాను 3:13
7. పరలోకములో నుండి దిగి వచ్చేదెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారము నేనే”. యోహాను 6:51
ప్రభువైన యేసు చెప్పెను - “నేను పైనుండువాడను.....నేను ఈ లోకసంబంధుడను కాను”. యోహాను 8:23
ప్రభువైన యేసు చెప్పెను - “నేను తండ్రియొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానను”. యోహాను 16:28
8. నిత్య జీవము పొందుట కొరకై ఎవరి నామములో మనము విశ్వాసముంచాలి?
జ) యేసు క్రీస్తు ప్రభుని నామములో
ప్రభువైన యేసు చెప్పెను - “విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను”.  యోహాను 3:14-15
ప్రభువైన యేసు చెప్పెను - “నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు”. యోహాను 10:28
9. ఆత్మ రక్షణ ఎవరి ద్వారా కలుగుతుంది?
జ) యేసు క్రీస్తు ప్రభువు ద్వారా
ప్రభువైన యేసు చెప్పెను - “నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడు”. యోహాను 10:9
10. మనకున్న ఆత్మీయ ఆకలిని దప్పికని తీర్చగలవారు ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
అందుకు యేసు వారితో ఇట్లనెను - “జీవాహారము నేనే; నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు”. యోహాను 6:35
11. అంత్యదినమున  మనుష్యులను సజీవులుగా లేపేది ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వాని లేపుదును”. యోహాను 6:40-44
12. జీవాహారము ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే”. యోహాను 6:48
13. ఎవరి మాటలు గతించిపోకుండా నిత్యమూ నిలిచి ఉంటాయి?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “ఆకాశమును భూమియు గతించిపోవును గాని నా మాటలు గతింపవు”. మార్కు 13:31
14. జీవమునిచ్చే ప్రాణ దాత ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “నన్ను తినువాడును నా మూలముగా జీవించును”. యోహాను 6:57
ప్రభువైన యేసు చెప్పెను - “ఒకడు నా మాటగైకొనినయెడల వాడెన్నడును మరణము పొందడనిమీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”. యోహాను 8:51
15. జీవమైయున్నవాడు ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “నేనే జీవమునై యున్నాను”. యోహాను 14:6
16. తనకొరకు మన ప్రాణం పోగొట్టుకున్నయెడల మన ప్రాణమును తిరిగి మనకివ్వగల వారెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును”. మత్తయి 10:39
17. అత్యున్నతమైన ప్రేమకు పాత్రుడైనవాడు ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “తండ్రినైనను తల్లినైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు”. మత్తయి 10:37
18. జీవజల నదివలె దేవుని ఆత్మను మనకు ప్రసాదించగలవారెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టువాని కడుపులోనుండి జీవజలనదులు పారును”. యోహాను 7:38
19. లోకమునకు వెలుగు ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “నేను లోకమునకు వెలుగునైయున్నాను; నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలవాడై యుండును”. యోహాను 8:12, 9:5

20. మనుష్యులను పాపము నుండి విడిపించగలవారెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు”.  యోహాను 8:34,36
22. నిత్యుడైన వారెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను”. యోహాను 8:57
23. పునరుత్థానమును జీవమునైనవారెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “నేనే పునరుత్థానమును జీవమునై యున్నాను; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును”. యోహాను 11:25
24. “ఫ్రభువు” అని పిలవబడుటకు అర్హుడెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను మీకు బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే”. యోహాను 13:13
25. విశ్వాసులకు పరలోకములో ఒక స్థలము సిద్ధపరచ గలవారెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను”. యోహాను 14:2
26. మనలను నిత్య జీవమునకు చేర్చగల “మార్గము” ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “నేనే మార్గమును”. యోహాను 14:6
27. మనలను నిత్య జీవమునకు చేర్చగల “సత్యము” ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “నేనే సత్యమును”. యోహాను 14:6
28. మంచి ఫలములు ఫలించుటకు అనగా మంచి పనులను చేయుటకు మనకు శక్తిని అనుగ్రహించేవారెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “నేను నిజమైన ద్రాక్షావల్లిని..... నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతటతానే యేలాగు ఫలింపదో ఆలాగే నాయందు నిలిచియుంటేనేకాని మీరును ఫలింపరు”. యోహాను 15:1-4
29. ఎవరికి దూరంగా ఉంటే నీవు ఏమీ చేయలేని వాడవైపోతావు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు”. యోహాను 15:5
30. మరణము మరియు పాతాళము యొక్క తాళపు చెవులు కలిగిన వారెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు మృతులలోకముయొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి”. ప్రకటన 1:18
31. హృదయములను మనసులను పరిశోధించే వారెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేను”. ప్రకటన 2:23
32. ప్రతివాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చేది ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున (ప్రతిఫలము) ఇచ్చెదను”. ప్రకటన 2:23
33. మనుష్యులకు తీర్పు తీర్చుటకై పరలోక మేఘములపై రాబోయేదెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
అందుకు ప్రధానయాజకుడు ఆయనను చూచి - నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవునితోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు - నీవన్నట్టే. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. మత్తయి 26:63,64
34. సబ్బాతు దినమునకు ప్రభువు ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “మనుష్యుకుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడు”. మత్తయి 12:8
35. నూతన సృష్టి ద్వారా సమస్తమును పునః స్థితిస్థాపన చేయబడ్డప్పుడు తన మహిమగల సింహాసనమందు కూర్చునేదెవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “(ప్రపంచ) పునర్జన్మమందుమనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును”. మత్తయి 19:28
36. సమస్త జనములకు తీర్పు తీర్చే తీర్పరి ఎవరు?
జ) యేసు క్రీస్తు ప్రభువు
ప్రభువైన యేసు చెప్పెను - “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పొగుచేయబడుదురు; గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరు పరచునట్లు ఆయన వారిని వేరుపరచును”. మత్తయి 25:31, 32
ప్రభువైన యేసు చెప్పెను - “కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లుఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెళుకువగా ఉండుడి”. లూకా 21:36
ప్రభువైన యేసు చెప్పెను - “తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరుచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు”. యోహాను 5:22, 23
యేసు ప్రభువు ఇలా అన్నారు - “నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను”. యోహాను 10:30
ఫిలిప్పు - ప్రభువా, తండ్రిని మాకుకనుపరుచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా , యేసు ప్రభువు ఇలా అన్నారు - ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? యోహాను 14:8, 9
యేసు క్రీస్తు ప్రభువు మానవ రూపములో వచ్చిన దేవుడు అని క్రైస్తవులు ఎందుకు అంటారు? క్రైస్తవులు ఈ అభిప్రాయమును తమకై తాము సొంతముగా కల్పించుకోలేదు, గాని మాటి మాటికి ఈ అభిప్రాయమును వ్యక్తపరిచి మానవులకు తెలియపరచినది యేసు క్రీస్తు ప్రభువే. క్రైస్తవులు ఆయన చెప్పిన మాటలను విశ్వసించారు, అంతే. ఈ విషయములో విభేదించేవారు, యేసు ప్రభువుతోను ఆయన  చెప్పుచున్న అభిప్రాయముతోను మరియు నిజ దేవుడైన యెహోవా దేవుని ప్రవక్తలందరి సాక్ష్యములతోనూ విభేదిస్తున్నారు. కనుక అట్టి అవిశ్వాసులకు నిత్యజీవము ఎన్నటీకీ ప్రాప్తించదు.



 




యేసు క్రీస్తు ప్రభువు తానెవరో బాహాటముగా ఎందుకు బయలుపరచలేదు?

I) యేసుక్రీస్తు ప్రభువు తన పరిపూర్ణ దైవత్వాన్ని బాహాటంగా అందరి ముందు ఎందుకు బయలుపరచలేదు?
1. "నేను దేవుడిని నన్ను ఆరాధించండి!" అని యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా ఎందుకు చెప్పలేదు? (యేసు ప్రభువారు పరోక్షంగా తెలియజేశారు - యోహాను సువార్త  6:41,42; 8:58; 17:4,5; ఇత్యాది వచనాలు).
2. "నేనే మెస్సీయాను, నన్ను విశ్వసించండి" అని యేసు బహిరంగముగా అందరికీ ఎందుకు ప్రచారం చేసికొనలేదు? (ఏకాంతముగా ఆయన వ్యక్తపరిచారు - యోహాను సువార్త 4:28). తాను మెస్సీయా అవునో కాదో స్పష్టంగా బయలుపరచాలని యూదులు యేసు ప్రభువారిని పట్టుబట్టిరి (లూకా సువార్త 22:67-70).
3. తాను "దేవుని కుమారుడిని" అని యేసు ప్రభువారు ఎందుకు చాలా అరుదుగా మాత్రమే చెప్పేవారు? (యోహాను సువార్త 5:25; 10:36; 11:4 చూడండి). అనేక మార్లు దేవుడిని తన "తండ్రి" అని పిలవడం ద్వారా వాస్తవముగా ఆయన దానిని వ్యక్తపరిచారు (మత్తయి సువార్త 27:43). అయినప్పటికీ ఆయన మరి స్పష్టంగా చెప్పాలని యూదులు పట్టుబట్టిరి (లూకా సువార్త 22:70).  "దేవుని కుమారుడు" అనే పదము మెస్సీయాకు సమాన పదముగా యూదులు వాడేవారు. కాబట్టి పైనున్న 2ను మరోసారి చదువుము.
4. అలా కాకుండా, దాదాపు ప్రతిసారి కూడా తనను తాను "మనుష్య కుమారుడు" అనే ఎందుకు ఆయన సంబోధించుకున్నారు?
5. ఇంకా, ఆయన ఎవరన్నదీ ఎవరికీ చెప్పవద్దంటూ ఆయనను సరిగా గుర్తించిన వారికి కూడా ఎందుకు ఖండితముగా ఆజ్ఞాపించారు?
i) ఆయన శిష్యులకు -  ''అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారినడిగెను. అందుకు సీమోను పేతురు - నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.... అటుపిమ్మట తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.'' (మత్తయి సువార్త 16:15,16,20; మార్కు సువార్త 8:29,30 వచనాలు కూడా చూడండి)
ii) దయ్యములకు - "ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు." (మార్కు 1:34 మరియు 24,25 వచనాలను కూడా చూడండి); "అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన యెదుట సాగిలపడి - నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలువేసిరి. తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.'' (మార్కు సువార్త 3:11,12); "ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు." (లూకా సువార్త  4:41)
iii) ఆయన నుండి స్వస్థత పొందినవారు - "యేసు ఆ సంగతి తెలిసికొని అచ్చటనుండి వెళ్లిపోయెను. బహు జనులాయనను వెంబడింపగా ఆయన వారినందరిని స్వస్థ పరచి, తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఆజ్ఞాపించెను....." (మత్తయి సువార్త 12:15,16);  "అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధియాయెను. అప్పుడు యేసు ఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను." (మత్తయి సువార్త 8:3,4); "వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పండ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయ మొందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని  ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను." (మార్కు సువార్త  5:42-43)
6) తాను ఎవరో నిరుపించుకోవాలన్న సవాలు విసిరినప్పుడు యేసు ఎందుకు ఆ సవాలుని అంగీకరించలేదు?
i) సాతాను - "ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చినీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను.... నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము....." (మత్తయి సువార్త 4:3,6)
ii) సామాన్య ప్రజలు -  "ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే  రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి." (మత్తయి సువార్త 27:39-40)
iii) శాస్త్రులును, పెద్దలును, ప్రధానయాజకులు - "ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువ మీద నుండి దిగినయెడల వాని నమ్ముదుము. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి." (మత్తయి సువార్త 27:41-43)
7) ఎందుకు యేసు ప్రజలతో ఎల్లపుడు ఉపమానరీతిగా మాటలాడారు?
"తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను - పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు... ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను: ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు..." "నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు." (మత్తయి సువార్త 13:10,11,13,14,34,35)
"ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు." (యోహాను సువార్త 1:10)
II) ఎందుకనగా అది ఒక ఆత్మీయ సత్యము; మానవ సంబంధమైనది కాదు:
1) ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన రెండు సంగతులను ఉన్నవి. వాటిని ఏ వ్యక్తి తనకు తానుగా అర్థం చేసికొనలేడు. అవేవనగా -
i) నిజముగా యేసు ప్రభువారు ఎవరు - "నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు." ..... "అందుకు యేసు - సీమోను బర్‍యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు  బయలుపరచలేదు." (మత్తయి సువార్త 16:15-17)
ii) యేసు క్రీస్తు ప్రభువారు చెల్లించిన ప్రాయశ్చిత్తము - "సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము... ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు." (1 కొరింథీయులకు :18; 2:14)
2) ఎందుకనగా దేవుని రహస్య జ్ఞానము కేవలం పత్యక్షతల ద్వారనే బయలుపరచబడును:
  • "రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు."(ద్వితీయోపదేశకాండము 29:29)
  • "ఇశ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరచుకొను దేవుడవైయున్నావు." (యెషయా 45:15)
  • "తెలియని మరుగైన క్రొత్తసంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను." (యెషయా.48:6)
  • "నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును."(యిర్మియా 33:3)
  • "ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగుయొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది." (దానియేలు 2:22)
  • "‘వారందరును దేవునిచేత బోధింపబడుదురు’ అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది" (యోహాను సువార్త 6:45)
  • "సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని  దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను  కాను. నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. ... నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపలేదు, .... అది యీ లోక జ్ఞానము కాదు, ...  దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము;  ఈ జ్ఞానము మరుగైయుండెను...." (1 కొరింథీయులకు 2:1-8)
  • "నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి....  మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మము....."  (కొలొస్సయులకు 2:2,3; 4:3 - మరియు 1:26,27 కూడా చూడండి)
3) ఎందుకంటే ఈ క్రింద తెలియచేయబడిన విధానములో తప్ప ఏ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి పై విశ్వాసం ఉంచలేడు:
  1. అతను/ఆమె దేవుడైన తండ్రి వద్దకు ఆకర్షింపబడాలి - "తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు... తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు... తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను." (యోహాను సువార్త 6:37,44,65)
  2. పరిశుద్ధాత్ముడే అతడికి/ఆమెకు యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి బయలుపరుస్తాడు - "దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచియున్నాడు...  దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము."  (1 కొరింథీయులకు 2:9-13)
  3. పరిశుద్ద లేఖనాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరచబడ్డారు - "యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను." (యోహాను సువార్త 20:31) (మరియు యోహాను సువార్త  5;39,40; రోమా.16:25,26; ఎఫెసీయులకు.3:4,5 కూడా చుడండి)
4) సాతాను మనుష్యుల మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను: "దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.. " (2 కొరింథీయులకు 4:4)